సైరా.. అస‌లు ప‌ని పూర్తిచేసారు..!


సైరా మేజ‌ర్ షెడ్యూల్ పూర్తైపోయింది. అందుకే హ‌మ్మ‌య్యా అంటూ హాయిగా ఉన్నాడు మెగాస్టార్. 35 రోజులుగా హైద‌రాబాద్ లోనే నాన్ స్టాప్ గా జ‌రుగుతుంది ఈ షెడ్యూల్. వాన‌ల్లో చాలా ఇబ్బందులు ప‌డుతూ ఈ షూటింగ్ చేసాడు సురేంద‌ర్ రెడ్డి. ఎందుకంటే నైట్ ఎఫెక్ట్స్ తో ఉండే కెమెరాల‌తో సైరా షూట్ జ‌రిగింది. బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాలవాడ పోరాడే స‌న్నివేశాల‌ను ఇందులో చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు.
సైరా కోసం జేమ్స్ బాండ్ ఫేమ్ గ్రెగ్ పావెల్ టాలీవుడ్ కు వ‌స్తున్నాడు. ఈయ‌న గ‌తంలో చాలా హాలీవుడ్ సినిమాల‌కు ప‌ని చేసాడు. జేమ్స్ బాండ్ సిరీస్ లోని స్కై ఫాల్ కి కూడా గ్రెగ్ ఫైట్స్ కంపోజ్ చేసాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చిరు కోసం ప‌ని చేస్తున్నాడు. ఇప్పుడు పూర్తైన షెడ్యూల్ ను పూర్తిగా ఈయ‌నే హ్యాండిల్ చేసాడు. క‌ళ్లు బైర్లు గ‌మ్మే ఫీట్లు చిరంజీవితో చేయించాడు ఈ స్టంట్ మాస్ట‌ర్. మ‌రోవైపు చిరు కూడా 63 ఏళ్ల వ‌య‌సులోనూ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఈ షెడ్యూల్లో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ పోరాడి మ‌రీ గ‌న్స్ అన్నీ దోచుకునే సీన్స్ చిత్రీక‌రించారు.
ఇవి మ‌రో స్థాయిలో ఉండాలని ప్లాన్ చేసిన సురేంద‌ర్ రెడ్డి.. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ను రంగంలోకి దించాడు. 35 రోజులు జ‌రిగిన‌ ఈ షెడ్యూల్ తో షూటింగ్ 60 శాతం పూర్తైపోయిన‌ట్లే. డిసెంబ‌ర్ లోపు షూటింగ్ అంతా ప‌ూర్తిచేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి ఈ షెడ్యూల్ త‌ర్వాత చాలా రిలాక్స్ డ్ గా క‌నిపిస్తున్నాడు చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here