శర్వానంద్-హనురాఘవపూడిల క్రేజీ ప్రోజెక్ట్ లో కథానాయికగా సెన్సేషనల్ బ్యూటీ సాయిపల్లవి

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా “ఫిదా, ఎం.సి.ఏ” చిత్రాలతో సెన్సేషనల్ హిట్స్ సొంతం చేసుకొన్న సాయిపల్లవిని ఎంపిక చేశారు.
“శతమానంభవతి, మహానుభావుడు” చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న శర్వానంద్ హీరోగా ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి మూడోవారం నుంచి మొదలవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. “శర్వానంద్, సాయిపల్లవి, హను రాఘవపూడి లాంటి ముగ్గురు ప్రతిభావంతులతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. హనురాఘవపూడి ఒక అద్భుతమైన కథ రెడీ చేశారు, శర్వానంద్-సాయిపల్లవి జంట కన్నులపండుగలా ఉంటుంది. హిలేరియస్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకొనే విధంగా తెరకెక్కనుంది. జనవరి మూడోవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న మా చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here