వైఎస్ఆర్ అదిరిపోయాడుగా..!


వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ముఖ్య‌మంత్రిగా తెలుగు రాష్ట్రాన్ని అద్భుత‌మైన ప్ర‌గ‌తి వైపు అడుగేసేలా చేసిన జ‌న నాయ‌కుడు. రాజ‌కీయ నాయ‌కుడు అన్న త‌ర్వాత పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి..
చాలా అలిగేష‌న్స్ ఉన్నాయి కానీ చ‌నిపోయిన వ్య‌క్తి గురించి ఇప్పుడు అవ‌న్నీ మాట్లాడ‌టం స‌రికాదు. ఆయ‌నకు ప్ర‌జ‌ల గుండెల్లో అంతులేని అభిమానం అయితే ఉంది. ఈయ‌న చ‌నిపోయి 9 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న జీవితంపై బ‌యోపిక్ రాలేదు. అప్ప‌ట్లో పూరీ జ‌గ‌న్నాథ్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనే సినిమా మొద‌లుపెట్టాడు.
రాజ‌శేఖ‌ర్ ఇందులో హీరోగా న‌టించాల‌ని ఫిక్స‌య్యాడు. కానీ త‌ర్వాత అనివార్య కార‌ణాల‌తో ఆగిపోయింది. ఇన్నేళ్ల‌కు వైఎస్ఆర్ బ‌యోపిక్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ సారి మాత్రం క‌న్ఫ‌ర్మ్. ఆనందో బ్ర‌హ్మ లాంటి సినిమాతో న‌వ్వించిన మహి వి రాఘ‌వ వైఎస్ఆర్ బ‌యోపిక్ బాధ్య‌త‌ తీసుకుంటున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.
వైఎస్ఆర్ గా మ‌మ్ముట్టి లుక్ పిచ్చెక్క పోయింది. ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ పూర్త‌యింది. ఎప్రిల్ 9న ముహూర్తం పెట్ట‌నున్నారు. యాత్ర పేరుతో వ‌స్తోన్న ఈ చిత్రంలో వైఎస్ఆర్ జీవిత అంతరంగం చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. ఇందులో జ‌గ‌న్ గా సుధీర్ బాబు న‌టిస్తున్నాడు. మిగిలిన పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టించ‌బోతున్నారు.. వైఎస్ బ‌యోపిక్ అంటే చంద్ర‌బాబు పాత్ర‌ను క‌చ్చితంగా పెట్టాల్సిందే. మ‌రి ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌బోతున్నారు..? ఇవ‌న్నీ ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. వైఎస్ఆర్ బ‌యోపిక్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here