మ‌హేశ్ మ‌ళ్లీ మారిపోయాడ‌బ్బా..!


మ‌హేశ్ బాబు అంటే మ‌న‌కు గుర్తొచ్చేది ఒక‌టే రూపం. ఏళ్లు మారినా ఈయ‌న మాత్రం మార‌డు. వ‌య‌సు 40 దాటినా ఇప్ప‌టికీ 20 ఏళ్ల బాలా కుమారుడిలా ఉంటాడు సూప‌ర్ స్టార్. అది ఆయ‌న గ్లామ‌ర్. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో కూడా కొత్త లుక్ మాత్రం ట్రై చేయ‌లేదు మ‌హేశ్.
ప్ర‌తీ సినిమాలోనూ ఒక‌టే లుక్ లోనే ఉంటాడు. ఇదే ఈయ‌న‌తో వ‌చ్చే స‌మ‌స్య కూడా. క‌థ‌లో కొత్త‌ద‌నం అప్పుడప్పుడూ చూపిస్తాడు కానీ లుక్ లో మాత్రం కొత్త‌ద‌నం చూపించ‌డు. మిగిలిన హీరోలంతా సినిమాకో విధంగా మారిపోతుంటే మ‌హేశ్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటానంటాడు. ఈయ‌న లుక్ చూసి మంత్రి కేటీఆర్ కూడా సెటైర్ వేసాడు. తాను ఒక్క రోజు మ‌హేశ్ అయితే ముందు లుక్ మారుస్తాన‌ని చెప్పాడు. ఇప్పుడు ఆ మాట‌లు మ‌హేశ్ కు కూడా బాగానే గుచ్చుకున్న‌ట్లున్నాయి అందుకే లుక్ మార్చేసాడు.
వంశీ పైడిప‌ల్లి సినిమాలో గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు ఈ హీరో. ఇప్ప‌టికే ఈ లుక్ ట్రెండ్ అయిపోయింది కూడా. అయితే ఇప్పుడు స‌డ‌న్ గా మ‌ళ్లీ పాత రూపంలోకి వ‌చ్చేసాడు ఈ సూప‌ర్ స్టార్. ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్త‌య్యేస‌రికి మ‌ళ్లీ క్లీన్ షేవ్ తో క‌నిపించాడు మ‌హేశ్. తాజాగా కూక‌ట్ ప‌ల్లిలో చెన్నై సిల్క్స్ షాప్ ఓపెనింగ్ కు వ‌చ్చిన మ‌హేశ్ కొత్తగా పాత లుక్ లో క‌నిపించాడు.
దీన్నిబ‌ట్టి రెండో షెడ్యూల్ కు చాలా స‌మ‌యం ఉంద‌ని అర్థ‌మైపోతుంది. ఏడాది చివ‌రి వ‌ర‌కు షూట్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసినా.. అనుకోని కార‌ణాల‌తో ఇది వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డింది. స‌మ్మ‌ర్ కానుక‌గా ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది వంశీ-మ‌హేశ్ సినిమా. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తుంది. దిల్ రాజు, అశ్వినీద‌త్ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here