జులై 13న "చినబాబు" విడుదల!


కార్తీ, సయేష జంటగా నటించిన ‘చినబాబు’ సినిమాను జులై 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
దర్శకులు పాండిరాజ్ రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించారు. మొదటిసారి రైతు పాత్రలో కార్తి కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ లో కార్తి చెప్పిన డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. రైతుల సమస్యలను చర్చిస్తూనే సినిమాలో కామెడీ, యాక్షన్ ఉండబోతోంది. శత్రు ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించారు. హీరో సూర్య, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి చినబాబు సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్స్ మరియు ద్వారకా క్రియేషన్స్ బ్యానర్స్ లో నిర్మించారు.
నటీనటులు:
కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను.
సాంకేతిక నిపుణులు:
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రుబన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here